ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం తాజాగా జరిగిన సమావేశంలో 12 కీలక అంశాలపై చర్చించి వాటికి ఆమోదం తెలిపింది. ముఖ్యమైన నిర్ణయాల వివరాలు ఇలా ఉన్నాయి:
---
✅ ప్రధాన నిర్ణయాలు:
1. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచితంగా RTC బస్సు ప్రయాణం.
2. జూలై 25 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ఆమోదం.
3. AP బార్ పాలసీకి కొత్త ఆమోదం.
4. నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పరిమితి 150 యూనిట్ల నుండి 200 యూనిట్లకు పెంపు.
5. AP Land Incentive Tech Hub Policy 4.0కి ఆమోదం.
6. AP టూరిజం కార్పొరేషన్ (APTDC) ఆధ్వర్యంలోని 22 హాస్టళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు అనుమతి.
7. తిరుపతి రూరల్ - పేరూరు గ్రామంలో ఓబరాయ్ హోటల్ కోసం కేటాయించిన 25 ఎకరాల టీటీడీ భూముల బదలాయింపు రద్దు.
8. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ₹900 కోట్ల బ్యాంక్ గ్యారెంటీలకు ఆమోదం.
9. APIICకు ₹7,500 కోట్ల రుణం తీసుకునేందుకు అనుమతి.
10. 5 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులకు మంజూరు.
11. మావోయిస్టు పార్టీ, RDF కార్యకలాపాలపై మరో ఏడాది నిషేధం.
12. ఇతర ప్రణాళికలపై మంత్రివర్గం సమీక్ష.