రాజమహేంద్రి డిప్యూటీ తహశీల్దార్ (డీటీ) మణిదీప్ రేవ్ పార్టీల వ్యవహారంలో కీలక పేరుగా మారాడు. అయితే ఆయన ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
సోమవారం తనకేమీ సంబంధం లేదని, ఎక్కడికీ పోలేదని చెప్పిన మణిదీప్… మంగళవారం మాత్రం ఆఫీసుకు సెలవు పెట్టాడు. తల్లి ఆరోగ్యం బాగోలేదని నాలుగు రోజుల సెలవు కావాలని లేఖ రాసి పంపాడు. వెంటనే ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయాడు.
ఈ పరిణామంతో మణిదీప్ అమాయకుడని చెప్పిన అధికారులు, ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆయన వ్యవహారాలపై స్పష్టత తీసుకురావాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి అభిషేక్ తెలిపారు.
తెలుసుకున్నట్లుగా, హైదరాబాద్ గచ్చిబౌలిలోని రాజేశ్వరి నిలయం సర్వీసు అపార్ట్మెంట్లో జరిగిన రేవ్ పార్టీపైన సోమవారం ఈగల్ టీమ్, గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడి చేసి డ్రగ్స్ ముఠాను బట్టబయలు చేశారు. ఈ కేసులో మణిదీప్ పేరు వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం ఆయన ధవళేశ్వరంలోని పోలవరం భూసేకరణ పరిపాలనా కార్యాలయంలో చింతూరు డివిజన్ వీఆర్పురం యూనిట్ స్పెషల్ డిప్యూటీ తహశీల్దార్గా పని చేయాలి. అయితే అక్కడ భూసేకరణ పనులు పట్టించుకోకుండా, ఎక్కువగా రాజమండ్రిలోనే తిరుగుతున్నారని ఒక అధికారి పేర్కొన్నారు.