ఎంపీ మిథున్‌రెడ్డి‌ను సిట్‌ కస్టడీకి తీసుకుంది. రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి సిట్‌ అధికారులు ఆయనను కస్టడీకి తీసుకుని విజయవాడకు తరలించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రిలో మిథున్‌రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక సిట్‌ అధికారులు విచారణను ప్రారంభించారు. కేసుకు సంబంధించిన వివిధ అంశాలపై సిట్‌ అధికారులు మిథున్‌రెడ్డిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.